‘సమైక్య పాలనలో అరకొర విద్యుత్తుతో ఆగమైనం. రాష్ట్రం రాకముందు కరెంటు కోతలతో ఇబ్బందులు పడ్డాం. రెండు, మూడు గంటల కరెంటుతో పనులు సక్కగ నడ్వకపోతుండే. కేసీఆర్ వచ్చినంక పదేండ్లు నిరంతర విద్యుత్తుతో పండుగలా ఎవుసం చేసుకున్నం. చిన్న వ్యాపారులు, దుకాణాదారులు, మెకానిక్లకు మంచిగ పని దొరికింది. రాష్ర్టాన్ని విద్యుత్తు సమస్యలు లేకుండా తీర్చిదిద్దిన కేసీఆర్ సారుపై నిందలేయడం సరికాదు..’ అని ప్రజలు తమ మనోగతాన్ని పంచుకున్నారు.
కేసీఆర్ పాలనలో కరెంటు కోతలు లేవు. మీసేవ అప్లికేషన్లు, జిరాక్స్ తీయడం వంటి పనులు ఆగకుండా చేసేవాళ్లం. 24గంటల కరెంటుతో ఇబ్బందులు లేకుండా ఉండేది. మీసేవకు వచ్చే కస్టమర్లు కూడా ఇబ్బంది పడకుండా ఏ సమయంలోనైనా వచ్చి పనులు చేయించుకొని వెళ్లేవాళ్లు. సమయం వృథా కాకుండా పనులు ఎక్కువ చేసి ప్రజలకు ఎల్లప్పుడూ సేవలందించేవాళ్లం.
కేసీఆర్ తీసుకొచ్చిన అనేక సంస్కరణలతో విద్యుత్తు వ్యవస్థ మెరుగుపడింది. ఆయన పట్టుదలతో 24గంటలపాటు కరెంటు ఇచ్చిండు. దీంతో గ్రామాల్లో చిన్న వ్యాపారులు, దుకాణాదారులు, మెకానిక్లకు మంచిగా పని దొరికింది. అలుపు లేకుండా పని ఉండేది. సీజన్ ఉన్నా లేకపోయినా పనులు మాత్రం బాగా ఉండేవి. అంత పనులు ఉన్నా కేసీఆర్ హయాంలో 24గంటల కరెంటుతో ఇబ్బంది లేకుండా పనులు తొందరగా పూర్తి చేసుకునేవాళ్లం. మంచి చేసిన కేసీఆర్పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు.
రుద్రూర్, జూన్ 27: కరెంటు అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటేనే కరెంటు… ఎందుకంటే ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన 24గంటల కరెంటు ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. ఇవ్వరేమోకూడా. నేను దాదాపు 10ఎకరాల భూమిని కౌలుకు చేస్తా. ఇంత కౌలుకు చేస్తున్న అంటే కూడా రాత్రిపూట వెళ్లి బోరు వేయలేదు. రోజంతా కరెంటు ఉంటే రాత్రివేళలో బోరు ఆన్ చేసి పొలం పారించాల్సిన అవసరం రాలేదు. కేసీఆర్ రాకమునుపు కరెంటు ఎప్పుడొస్తదా అని ఎదురుచూస్తూ ఉండేవాళ్లం. రాత్రి టైంల పొలానికి పోతే కరెంటు షాక్, పాము కాట్లకు గురయ్యేవాళ్లం. రైతులకు ఆ తిప్పలు లేకుండా చేసింది కేసీఆరే.