సుభాష్నగర్ , జూన్ 28 : మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బోర్గాం చౌరస్తా వద్ద తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు ఆధ్వర్యంలో పీవీ 103వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా బాజిరెడ్డి గోవర్ధన్ హాజరై పీవీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు పీవీ ఆద్యుడని పేర్కొన్నారు. నగర మేయర్ దండు నీతూకిరణ్ పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కిరణ్కుమార్ దేశ్ముఖ్, కార్యదర్శి రొట్టె సురేశ్, కోశాధికారి పుల్కల్ రమేశ్, పురుషోత్తం, లక్ష్మీనారాయణ భరద్వాజ్, మేడిచర్ల శ్రీనాథ్, చంద్రశేఖర్ శర్మ, అప్పాల కిష్టయ్య, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.