లోక్సభ సభ్యులుగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. ఎంపీగా రెండోసారి గెలిచిన అర్వింద్ ఇంగ్లిష్లో ప్రమాణ స్వీకారం చేశారు. సురేశ్ శెట్కార్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి చివరగా జై హింద్.. జై తెలంగాణ అంటూ ముగించారు.