భీమ్గల్, జూన్ 26: భీమ్గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా నవీన్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు సీఐగా విధులు నిర్వహించిన శ్రీనివాస్ను అధికారులు ఆకస్మికంగా ఐజీ ఆఫీస్కు అటాచ్ చేశారు. ఐజీ కార్యాలయంలో వెయిటింగ్లో ఉన్న సీఐ నవీన్.. భీమ్గల్ వచ్చి బాధ్యతలు తీసుకునే వరకు తనను బదిలీ చేశారనే విషయం విధులు నిర్వహిస్తున్న సీఐ శ్రీనివాస్కు తెలియకపోవడం గమనార్హం. వచ్చిన ఐదు నెలల్లోనే బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా బాధ్యతలు చేపట్టిన సీఐ నవీన్ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.
నూతన పీఆర్సీలో కనీస వేతనం రూ.26వేలుగా నిర్ణయించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులు.