వినాయక్నగర్, ఫిబ్రవరి 15: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలతోపాటు గుర్తులు, చిహ్నాలు మారుస్తున్నట్లుగానే నిజామాబాద్ జిల్లా పేరును ఇందూరుగా మార్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం జీరోఅవర్లో నిజామాబాద్ అర్బన్ సమస్యలపై ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడారు. తమ నియోజకవర్గంలో చాలా మంది పేదలు ఉన్నందున 7వేల ఇండ్లు మంజూరు చేయాలని, అధ్వానస్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలన్నారు. క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.