భీమ్గల్, మే 27: మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(13)పై లైంగికదాడి కేసులో ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. ఎస్సై కథనం మేరకు.. ఈ నెల 25న రాత్రి ఇంటి వద్ద ఉన్న బాలికను అదే గ్రామానికి చెందిన చాంద్పాషా(35) తన బైక్పై ఎక్కించుకొని బయటికి తీసుకెళ్లాడు. బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. బాలిక కుటుంబ సభ్యులు ఈనెల 26న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు చాంద్పాషాను రిమాండ్కు తరలించారు.
చాక్లెట్ ఆశచూపి..
మోపాల్(ఖలీల్వాడి ) మే 27: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని ఓ గ్రామంలో యువకుడు చాక్లెట్ ఆశచూపి ఆరేండ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మోపాల్ మండలంలోని ఓ గ్రామంలో పక్కింట్లో ఉంటున్న యువకుడు బయట ఆడుకుంటున్న ఆరేండ్ల బాలికకు చాక్లెట్ ఇస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం లైంగిక దాడికి యత్నించగా బాలిక కేకలు వేయడంతో బాలిక చిన్నమ్మ చూసి గట్టిగా అరిచింది. దీంతో యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు నిందితుడి ఇంటిపై దాడిచేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.