పాఠశాలలు పునఃప్రారంభమై 20రోజులు కావస్తున్నది. అయినా చెట్ల కిందే బోధన సాగుతున్నది. అందుకు నిదర్శనమే నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం గన్యాతండాలోని ప్రాథమిక పాఠశాల. అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద బడి మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించినా.. పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ 12వ తేదీ నాటికే పనులు పూర్తవ్వాల్సి ఉన్నా అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తేదారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు ఇంకా చెట్ల కిందే చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.