సమైక్యపాలనలో కరెంటు బాధలుపడ్డాం. పొద్దుగాల్ల కరెంటు పోతే పొద్దుగూకంగ వస్తుండె. మధ్యలో కరెంటు లేక మా పనులు సరిగ్గా నడ్వకపోతుండె. తెలంగాణ అచ్చినంక కేసీఆర్ సారు హయాంల కరెంటు బాధ పోయింది. ఆయన పాలనలో 24గంటలపాటు కరెంటు ఉంటుండె. కరెంటు ఇచ్చేటప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా తొందరగా తీరుతుండె. అంతమంచిగ చేసిండు. అసొంటి సారుపై నిందలు మోపొద్దు. సవ్యమైన కరెంటు ఇచ్చి రంది లేకుండా చేసిండు.. అని ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు అభిప్రాయం వ్యక్తంచేశారు. కరెంటు సరఫరాపై వారి మనోగతాన్ని వివరించారు.
జిరాక్స్ సెంటర్కు కరెంటు తప్పనిసరి. కేసీఆర్ సార్ హయాంలో 24గంటల కరెంటు ఉంటుండె. జిరాక్స్ సెంటర్తోపాటు ఫొటో స్టూడియో ఇప్పటికీ నడుపుతున్నాను. కరెంట్ కోతలు లేకుంటే పని సజావుగా, సులభంగా సాగుతుండె. దీంతో కస్టమర్లకు ఏసమస్య తలెత్తేది కాదు. కస్టమర్లతోపాటు నేనూ సంతోషంగా నడిపేవాన్ని.
ఎడపల్లి, జూన్ 26: మాజీ సీఎం కేసీఆర్ హయాంలో కరెంట్ ఫుల్టైమ్ 24గంటలు ఇస్తుండె. కరెంట్ పోయే సమస్యే లేకుండె. మీ సేవ అంటే కరెంట్ మీదనే ఆధారం ఉంటుండె. కేసీఆర్ పాలనలో కరెంటుకు ఏం ఇబ్బంది లేకుండె. నాణ్యమైన కరెంటు వస్తుండె. ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా కరెంటును ఇచ్చిండు.