ధర్పల్లి, జూన్ 30 : వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతులందరికీ ప్రభుత్వం రైతుభరోసా అందించాలని మండలంలోని రైతులు కోరారు. రైతుబంధు పథకానికి సంబంధించి అధికారులకు సలహాలు, సూచనలు అందజేశారు. ధర్పల్లి మండలంలోని ధర్పల్లి, రామడుగు, హొన్నాజీపేట్ సొసైటీల్లో రైతుబంధు పథకంపై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక మహాజన సభలను ఆదివారం ఏర్పాటు చేశారు. సభకు జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్ హాజరై రైతుల నుంచి సలహాలు, సూచనలు సేకరించారు. ఆబాదిలోకి వచ్చిన భూములకు తప్ప వ్యవసాయం చేస్తున్న భూమికి తప్పకుండా రైతు భరోసా ఇవ్వాలని రైతులు సూచించారు.
కుటుంబంలో ఎంత మంది రైతులున్నా ఒక్కో రైతుకు 10 ఎకరాల వరకు రైతుబంధు ద్వారా డబ్బులు అందించాలని అన్నారు. పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందించాలని మరికొంత మంది రైతులు కోరారు. రైతుల సూచనలను ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా వ్యవసాయాధికారి తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి, సొసైటీ స్పెషల్ ఆఫీసర్ ఆనంద్కుమార్, ఏఈవో లక్ష్మీప్రసన్న, సొసైటీ వైస్చైర్మన్ గున్నయ్య, నాయకులు నల్ల హన్మంత్రెడ్డి, పోతరాజు, శ్రీనివాస్నాయక్, రాజాగౌడ్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.