డిచ్పల్లి/ ఇందల్వాయి/ఆర్మూర్టౌన్, జూన్ 30 : రైతు భరోసా పథకంపై వ్యవసాయాధికారులు రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. జిల్లా పలు సొసైటీల్లో ఆదివారం మహాజన సభలు నిర్వహించగా.. అధికారులు రైతుల అభిప్రాయాలను సేకరించి, వివరాలను నమోదు చేసుకున్నారు. డిచ్పల్లి మండలం రాంపూర్, మెంట్రాజ్పల్లి గ్రామాల్లోని రైతువేదికల్లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ప్రత్యేక మహాజన సభను నిర్వహించారు. ఈ సభకు జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్, ఏడీఏ ప్రదీప్కుమార్ హాజరై మాట్లాడారు. 10 ఎకరాల రైతుకు రైతుభరోసా అమలుచేయాలని, నాలా భూములు, చెరువులు, సాగులేని భూముల రైతులకు అవసరం లేదని తీర్మానించారు. కార్యక్రమంలో డీసీవో శ్రీనివాస్రావు, విండో చైర్మన్లు తారాచంద్, శ్రీనివాస్రెడ్డి, ఏఈవోలు రూపేశ్, సంధ్య, రేఖ తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలకేంద్రంతోపాటు నల్లవెల్లి సొసైటీలో మహాజన సభను నిర్వహించారు.
సభకు జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్, డీసీవో శ్రీనివాస్రావు హాజరై మాట్లాడారు. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి, మహాజన సభలో తీర్మానం చేసి ప్రభుత్వానికి అందజేస్తామని వారు తెలిపారు. ఆదాయ పన్నుతో సంబంధం లేకుండా అందరి రైతులకు రైతుభరోసా ఇవ్వాలని, ప్రతి సీజన్లో జూన్ 10, నవంబర్ 15 లోగా రైతుబంధు సాయం అందేటాచూడాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ ప్రదీప్కుమార్, సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఏఈవోలు ప్రకాశ్గౌడ్, శ్రీశైలం, సీఈవో తేజాగౌడ్, రతన్, ఎంపీటీసీ సుధాకర్, వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, వైస్చైర్మన్లు మారుతి, రమేశ్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణం పెర్కిట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ప్రత్యేక అధికారి శ్రీరామ్ నిర్వహించిన ప్రత్యేక మహజన సభ వాడివేడిగా సాగింది. రైతు భరోసాపై సలహాలు, సూచనలు స్వీకరించామని అన్నారు. అనంతరం యూరియా లభించడం లేదంటూ పలువురు రైతులు సొసైటీ చైర్మన్, పాలకవర్గాన్ని ప్రశ్నించడంతో కొద్దిపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని పాలకవర్గ సభ్యులు తెలిపారు.