తెలంగాణ రాకముందు కరెంట్ కష్టాలు చెప్పలనవికాదు. ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతుండెనో కూడా తెలిసేది కాదు..దీంతో రైతులు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విద్యుత్ ఆధారిత పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. స్వరాష్ట్రం వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం కరెంట్ కష్టాలను తీర్చింది. నివాస గృహాల నుంచి పరిశ్రమల వరకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసింది. దీంతో విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచింది. స్వరాష్ట్రంలో విద్యుత్ వెలుగులు నింపిన మాజీ సీఎం కేసీఆర్పై నిందారోపణలు చేయడం సరికాదని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు.
‘ఇరవై ఏండ్లుగా పిండిగిర్ని నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. తెలంగాణ రాక ముందు కరెంటు కోతలు ఉండడంతో పిండి గిర్ని సరిగా నడిసేది కాదు. కరెంటు వచ్చినప్పుడే గిర్నీ నడిచేది. అయితే ఉదయం.. లేకపోతే సాయంత్రం వేళలోనే పిండిగిర్నికి సంబంధించిన కరెంటు వస్తుండె. సరైన గిరాకీ లేక మస్తు ఇబ్బందులు పడ్డ. తెలంగాణ అచ్చినంకనే కరెంట్ కష్టాలు పోయినయ్. కేసీఆర్ సారు 24 గంటలు కరెంట్ ఇచ్చిం డు. పిండి గిర్ని నడిచేందుకు ఇబ్బంది లేకుండా పోయింది. ఆ సారు ఏం జేసిండో కానీ మా కష్టాల్ని తీర్చిండు. కరెంటు కోతలు అనేవి లేకుండా చేసిండు. ఆయన అధికారంల ఉన్నంత కాలం కరెంటు మస్తుగా ఉండె.
కేసీఆర్ సారు అచ్చినంకనే మాకు తిప్పలు తప్పినయ్. తెలంగాణ రాక మునుపు మస్తు కష్టాలు వడ్డం. ఎప్పుడు వస్తుండెనో, ఎప్పుడు పోతుండెనో తెలియక పోతుండె. ఆరు గంటల కంటే ఎక్కువ ఉండక పోతుండె. అది కూడా పొద్దుందాకా మూడు గంటలు. తెల్లందాక మూడు గంటలు. పొలం కాడ్నె పండుకుంటుంటిమి. అచ్చే మూడు గంటల కరెంట్ కోసం తెల్లందాక జాగారం జేస్తుంటిమి. గా బాధలు ఇప్పుడు యాదికస్తే కండ్లకెళ్లి నీళ్లు అత్తయ్. చానా మంది అప్పట్ల పంటలు ఏసుడే బంద్ జేసిండ్రు. కేసీఆర్ సార్ అచ్చుడితోని మా కష్టాలు దూరమయినయ్. పొద్దుందాక, తెల్లందాక తోట్ల కరెంట్ ఉంటుండె. చీకట్ల పొలం కాడికి పోవుడు తప్పింది. ఫుళ్లు కరెంట్ ఉండుడు, కాలం మంచిగ అవుతుడుతోని యాట రెండు పంటలు తీసినం. కేసీఆర్ సార్ ఏం జేసిండో కానీ రైతులకు ఎసొంటి కష్టాలు లేకుండా జేసిండు.