1. భారతదేశంలో ఎడారి మృత్తికకు సంబంధించి సరైన వివరణ కానిది ఏది ?
ఎ. భారతదేశంలో వాయవ్యాన, ఆరావళి పర్వతాలకు పశ్చిమాన ఎడారి నేలలు విస్తరించి ఉన్నాయి
బి. ఎడారి మృత్తికలు నైట్రేట్స్, ఫాస్పేట్స్కు ప్రసిద్ధి చెందినవి
సి. రాజస్థాన్లో ఎడారి నేలల ప్రాంతం లో ప్రముఖ సరిస్కా టైగర్ రిజర్వు ఉంది
1) ఎ, బి 2) బి, సి
3) పైవన్నీ 4 పైవేవి కావు
2. కింది వివరణలు గమనించండి
ఎ. ఉత్తర భారతదేశంలో ప్రముఖ
హ్యూమస్కు ప్రసిద్ధి చెందిన నేలలుగా పర్వతీయ నేలలను చెప్పవచ్చు
బి. హిమాలయాల్లో డూన్స్, దక్షిణ భారతదేశంలో గల నీలగిరి పర్వతాలు ప్రముఖ పండ్ల తోటలు సుగంధ ద్రవ్యాల పంటలకు ప్రసిద్ధి
పై అటవీ నేలలకు సంబంధించి
సరైనది ఏది?
1) ఎ, బి 2) ఎ
3) బి 4) పైవేవీ కావు
3. కింది వివరణలు గమనించండి
ఎ. ప్రధానంగా మృత్తిక క్రమక్షయం గాలి, నీరు వల్ల సంభవిస్తుంది
బి. పశ్చిమ కనుమల్లో మృత్తిక క్రమక్షయం వల్ల పై మృత్తిక కొట్టుకుపోయి గులకరాళ్లు గల శిలా ఉపరితలం
ఏర్పడుతుంది
పై ప్రవచనాల్లో సరైన వివరణ ఏది?
1) ఎ, బి 2) ఎ 3) బి 4) ఏదీకాదు
4. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. అటవీకరణ చేపట్టడం వల్ల
నేల క్రమక్షయం నివారించవచ్చు
బి. గడ్డి పెంపకం అధికంగా చేపట్టడంతో నేల క్రమక్షయం నివారణపై అంతగా ప్రభావం చూపించదు. కానీ పశువుల మేత కొరత నివారించవచ్చు.
నేల క్రమక్షయం నివారణ చర్యలేవి ?
1) ఎ, బి 2) ఎ
3) బి 4) ఏదీకాదు
5. కింది వాటిని జతపరచండి.
ఎ. ఊటి 1. నల్లరేగడి నేలల
పరిశోధన కేంద్రం
బి. బళ్లారి 2. కేంద్రీయ అటవీ
నేలల పరిశోధన
కేంద్రం
సి. పస్సద్ 3. గుజరాత్ అవనాళిక పరిశోధన కేంద్రం
1) ఎ-2, బి-3, సి-1
2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-2, బి-1, సి-3
4) ఎ-3, బి-2, సి-1
6. కింది వాటిని జతపరచండి.
ఎ. కలకత్తా 1. యమున అవనాళిక పరిశోధనా కేంద్రం
బి. ఆగ్రా 2. రాజస్థాన్ అవనాళిక పరిశోధనా కేంద్రం
సి. కోటా 3. సాయిల్ సర్వే
ఆఫ్ ఇండియా
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-1, సి-2
3) ఎ-1, బి-3, సి-2
4) ఎ-3, బి-2, సి-1
7. కింది వాటిని జతపరచండి.
ఎ. 3వ దశ 1. నీటి పారుదల
ప్రాజెక్టుల అభివృద్ధి
బి. 2వ దశ 2. ఎఫ్సీఐ సంస్థ
ఏర్పాటు
సి. 1వ దశ 3. హైబ్రిడ్
విత్తనాల అభివృద్ధి వ్యవసాయ విధానంలో వచ్చిన మార్పుల్లో సరైన జత ఏది?
1) ఎ-2, బి-3, సి-1 2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-2, బి-1, సి-3 4) ఎ-3, బి-2, సి-1
8. కింది వాటిని జతపరచండి.
ఎ. నల్ల విప్లవం 1. జనపనార ఉత్పత్తి
బి. గుండ్రని విప్లవం
2. కిరోసిన్ విప్లవం
సి, బంగారు పీచు విప్లవం
3. బంగాళదుంప
ఉత్పత్తి
1) ఎ-2, బి-3, సి-1
2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-2, బి-1, సి-3
4) ఎ-3, బి-2, సి-1
9. కింది వాటిలో సరికాని జత గుర్తించండి.
1. నూనె గింజల ఉత్పత్తి –
పసుపు విప్లవం
2. కోడిగుడ్లు, కోళ్ల ఉత్పత్తి –
వెండి విప్లవం
3. ఆపిల్ ఉత్పత్తి – బంగారు విప్లవం
4. ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి-ఊదా విప్లవం
10. కింది వాటిలో సరైనది?
ఎ. నల్లరేగడి నేలలను ఉష్ణమండల
చెర్నోజెమ్ నేలలు అని కూడా పిలుస్తారు
బి. బసాల్ట్ శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడిన నేలలను లాటరైట్ నేలలు అని పిలుస్తారు
సి. గ్రానైట్, స్ఫటికాకార రూపాంతర
శిలలు శైథిల్యం చెందడం వల్ల
ఎర్ర మృత్తికలు ఏర్పడతాయి
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
11. కింది వాటిని పరిశీలించండి.
ఎ. భారతదేశంలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల రాష్ట్రం
ఉత్తరప్రదేశ్
బి. భారతదేశంలో స్వాతంత్య్ర అనంతరం ఆహార కొరత ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం అమెరికాతో పబ్లిక్ లా పథకం ద్వారా గోధుమలు, పాల పిండిని దిగుమతి చేసుకుంది
సి. హరిత విప్లవం అనే పదం మొదట ఉపయోగించిన వ్యక్తి నార్మన్ బోర్లాగ్
పై సమాచారంలో సరైనది ఏది?
1) ఎ 2) ఎ, బి
3) పైవన్నీ 4) బి, సి
12. కింది వాటిని పరిశీలించండి.
ఎ. పత్తి, సజ్జ, జనుము,
శనగలు, మొక్కజొన్న
బి. గోధుమ, శనగలు, బార్లీ, ఆవాలు
సి. గోధుమ, ఆవాలు, జనుము, సజ్జ
పై సమాచారంలో రబీ కాల
పంటలను గుర్తించండి?
1) ఎ, బి 2) బి, సి
3) బి 4) సి
13. కింది శాస్త్రీయ నామాలను జతపరచండి.
ఎ. జొన్న 1. కజానస్ కజాన్
బి. కందులు 2. పెన్నిసెటమ్ గ్లౌకుమ్
సి. సజ్జ 3. సోర్గమ్ వల్గేరే
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-1, సి-2
3) ఎ-3, బి-2, సి-1
4) ఎ-2, బి-1, సి-3
14. సరికాని జతను గుర్తించండి.అంశం ప్రవేశ పెట్టిన వ్యక్తి
1. ఇంద్ర ధనుస్సు విప్లవం నితిన్ కుమార్
2. హరిత విప్లవం ఎం.ఎస్ స్వామినాథన్
3. బంగారు వరి ఇంగో ప్రాస్టికస్
4. సూపర్ గోధుమ ఎస్.నాగరాజు
1) 1, 2 2) 3, 4 3) పైవన్నీ సరైనవే 4) ఏదీ సరైనది కాదు
15. కింది పరిశోధనా కేంద్రాల్లో సరికానిది ఏది?
1. నేషనల్ రీసెర్చ్ సెంటర్
ఆన్ పిగ్స్-రాని (గువాహటి)
2. అరటి పరిశోధన కేంద్రం-
తిరుచురాపల్లి
3. నేషనల్ టొబాకో రీసెర్చ్
ఇన్స్టిట్యూట్- రాజమండ్రి
1. 1 2. 1, 2
3. 1, 2, 3 4. ఏదీకాదు
16. భారత ప్రభుత్వం సీ బర్ట్ హార్న సాగును ప్రోత్సహిస్తుంది. దీని ప్రాముఖ్యత ఏమిటి?
1. నేల క్రమక్షయం నియంత్రించడంలో సహాయపడుతుంది
2. ఇది బయో డీజిల్కు మంచి వనరు
3. దీనిలో పోషక విలువ ఉంది. ఎత్తయిన ప్రాంతాల్లో, శీతల ప్రాంతాల్లోనూ జీవించడానికి అనుకూలంగా ఉంటుంది
4. దీని కలప వాణిజ్య పరంగా విలువైనది పై వివరణల్లో సరైనది ఏది?
1) 1, 2 2) 1, 2, 3
3) 1, 3 4) 1, 2, 3, 4
17. భారతదేశంలోని కింది పంటలను పరిశీలించండి.
1. వేరుశనగ 2. నువ్వులు
3. పెసర 4. గోధుమ
పైన పేర్కొన్న వాటిలో ప్రధాన
వర్షాధార పంటలేవి?
1) 1 2) 3
3) 1, 2 4) 1, 2, 3, 4
18. సూక్ష్మ సేద్యానికి (బిందు సేద్యం) సంబంధించి కింది స్టేట్మెంట్లలో సరైనది ఏది?
1. సేంద్రియ ఎరువులు లేదా పోషక విలువలు కోల్పోవడాన్ని తగ్గించడం
2. మెట్ట భూముల సాగుకు అనుకూలమైన వ్యవసాయ పద్ధతి
3. భూగర్భ జలాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ విధమైన సాగు అనుకూలం
1) 1 2) 2
3) 1, 3 4) 1, 2, 3
19. కింది వాటిలో సరిగా జతచేసినవి ఏవి?
1. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్- నాగపూర్
2. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్- ఢిల్లీ
3. మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా- ఛోటానాగపూర్ పీఠభూమి
1) 1, 2 2) 1 3) 2, 3 4) 1, 2, 3
20. కింది వాటిని పరిశీలించండి.
1. శిలలో ఖనిజాలు సాంద్రీకరణ చెందినట్లయితే దాన్ని ధాతువు అంటారు. ధాతువు మలినాలను లేదా వివిధ ఖనిజాల కలయికగా ఉంటుంది
2. భారతదేశంలో ఖనిజ విధానాన్ని పరిశీలించడానికి నియమించిన కమిటీ హుడా కమిటీ
3. ఒకటి- ఒకటి కంటే ఎక్కువ మూలకాలు భూపటలంలో రసాయనికంగా సంయోగం చెంది ఏర్పడే ఘన స్థితిలో గల కర్బన, అకర్బన సమ్మేళనాలను ఖనిజాలు అంటారు
1) 1 2) 1, 2
3) 2, 3 4) 1, 2, 3
21. కింది వాటిని పరిశీలించండి.
1. ఛత్తీస్గఢ్ – బైలడిల్లా, బస్తర్దూర్
2. జార్ఖండ్ – సింగ్భం, నోవమండి
3. ఒడిశా – బీర్భం, గుడ్వ్రాన్
భారతదేశంలో ఇనుప ఖనిజం లభించే ప్రాంతాల్లో సరైన జత ఏది?
1) 1 2) 1, 2
3) 2, 3 4) 1, 2, 3
22. కింది ప్రవచనాలు పరిశీలించి సరైనది గుర్తించండి.
1. ప్రపంచంలో మొదటిసారిగా ఉపయోగించిన ఖనిజం రాగి
2. భారతదేశంలో ఖనిజ సంపద అత్యల్పంగా గల ప్రాంతం గంగా మైదాన ప్రాంతం
1) 1 2) 1, 2
3) 2 4) ఏదీకాదు
23. కింది వాటిలో సరికానిది?
1) ఇలైమలై కొండలను కార్డమమ్
కొండలు అని పిలుస్తారు
2) పళని కొండలు కేరళ రాష్ట్రంలో
విస్తరించి ఉన్నాయి
3) ద్వీపకల్ప పీఠభూమిలో
ఎత్తయిన శిఖరం అనైముడి
4) గంగా-సింధూ మైదానం
ప్లీస్టోసీన్ కాలం నుంచి నేటి వరకు
ఏర్పడుతుంది
24. బైలాడిల్లాలోని ఇనుప ఖనిజం
ప్రధానంగా కింది ఏ ఓడరేవు ద్వారా జపాన్కు రవాణా చేస్తున్నారు?
1) జవహర్లాల్ నెహ్రూ పోర్ట్
2) విశాఖపట్నం పోర్ట్
3) మంగళూర్ పోర్ట్
4) హల్దియా పోర్ట్
25. కింది వాటిలో సరికానిది ఏది?
1) కోయంబత్తూరును ‘మాంచెస్టర్
ఆఫ్ సౌత్ ఇండియా’ అని పిలుస్తారు
2) భారత్లో తొలి ఇనుము -ఉక్కు పరిశ్రమను ‘ పోర్టోనోవా’ వద్ద ఏర్పాటు చేశారు
3) 1907లో సక్చి వద్ద జంషెడ్జీ టాటా ‘టిస్కో’ను ఏర్పాటు చేశారు
4) 1937లో ‘అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ను దామన్ జోడి వద్ద ఏర్పాటు చేశారు
సమాధానాలు
1. 4 2. 1 3. 1 4. 2
5. 3 6. 2 7. 1 8. 1
9. 4 10. 2 11. 2 12. 3
13. 2 14. 4 15. 4 16. 3
17. 3 18. 3 19. 4 20. 4
21. 2 22. 2 23. 2 24. 2
25. 4
-టాపర్స్ ఇన్స్టిట్యూట్,దిల్సుఖ్నగర్, హైదరాబాద్