ఎ. కర్ణాటకలోని చాళుక్యుల్లో ముఖ్యుడైన దంతిదుర్గుడు హిరణ్యగర్భ (బంగారు గర్భం) అనే సంస్కార విధిని నిర్వహించాడు. తద్వారా తాను పుట్టుకతో క్షత్రియుడు కాకున్నా క్రతువుతో పునర్జన్మ పొందుతానని భావించాడు
బి. కదంబ మయూరశర్మ, గూర్జర ప్రతిహార హరిశ్చంద్రులు బ్రాహ్మణులు అయినప్పటికీ వారి సంప్రదాయ వృత్తులు వదిలి ఆయుధాలు చేతబట్టి కర్ణాటక, రాజస్థాన్లో రాజ్యాలేర్పరిచారు
సి. శాసనాల్లో పేర్కొన్న మొదటి భాగాన్ని ప్రశస్తి అంటారు. స్వయంగా రాజే వీటిని రాసేవారు
పై వాక్యాల్లో సరికానివి గుర్తించండి?
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) బి
ఎ. కశ్మీర్ను పాలించిన రాజుల చరిత్రపై 12వ శతాబ్దంలో అసాధారణమైన పెద్ద పద్యం సంస్కృతంలో కల్హణుడు తన రాజతరంగిణిలో రాశాడు
బి. గంగానది లోయ ప్రాంతంపై నియంత్రణ కోసం గూర్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాలవంశం రాజులు నిత్యం ఘర్షణ పడేవారు. దీన్నే త్రైపాక్షిక పోరాటం అంటారు
సి. కితాబ్-అల్-హింద్ అనే గ్రంథం అల్ బెరూని రచించాడు. దీని ద్వారా గజిని ఆక్రమించుకొన్న ప్రాంతాల గురించి తెలుసుకోవచ్చు
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, బి, సి 4) పైవేవీ కావు
ఎ. చౌహాన్ వంశస్థుడైన పృథ్వీరాజ్-3, మహ్మద్ ఘోరీ మధ్య తరైన్ యుద్ధం జరిగింది
బి. గజినీ మహమ్మద్ తన దండయాత్ర లో సోమనాథ్ ఆలయంతో సహా అనేక సంపన్న దేవాలయాలు దోచుకున్నాడు
సి. పల్నాటి వీరుల చరిత్రను శ్రీనాథుడు రచించాడు
1) ఎ, బి, సి 2) బి, ఎ, సి
3) సి, బి, ఎ 4) సి, ఎ, బి
1. వెల్లన్ వాగై ఎ. బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి
2. బ్రహ్మధేయ బి. బ్రాహ్మణులకు బహూకరించిన భూమి
3. శాలభోగ సి. పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమి
4. తిరునామత్తుకని డి. దేవాలయాలకు బహూకరించిన భూమి
5. పళ్లిచ్ఛందం ఇ. జైన సంస్థలకు విరాళమిచ్చిన భూమి
1) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి, 5-ఇ 2) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి, 5-ఇ
3) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి, 5-ఇ 4) పైవేవీ కావు
1) రుద్రదేవుడు, ప్రోలరాజు-2, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్ర-2
2) ప్రోలరాజు-2, రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్ర-2
3) ప్రతాపరుద్ర-2, రుద్రమదేవి,
గణపతిదేవ, ప్రోలరాజు-2, రుద్రదేవ
4) ప్రతాపరుద్ర-2, రుద్రమదేవి,
గణపతిదేవ, రుద్రదేవ, ప్రోలరాజు-2
ఎ. విద్యానాథుని క్రీడాభిరామం, వినుకొండ వల్లభరాయుని ప్రతాపరుద్ర యశోభూషణం, ఏకామ్రనాథుని ప్రతాపరుద్రచరిత్రలు కాకతీయుల పాలనా కాలం నాటివి
బి. శాసనాలు, సాహిత్యాధారాల ప్రకారం కాకతీయ వంశ మూలపురుషుడు దుర్జయ వీరిని ఆంధ్రరాజులు అని కీర్తించారు
సి. కాకతీయులు మొదటగా చాళుక్యుల వద్ద తర్వాత రాష్ట్ర కూటుల వద్ద సామంతులుగా పనిచేసి రట్టడిలుగా నియమితులై తర్వాత తెలంగాణలోని అనుమకొండని పొందారు
డి. గణపతి దేవుని కాలంలో వీరి రాజధాని అనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చబడింది
1) ఎ, బి 2) ఎ, డి
3) బి, సి 4) ఎ, బి, సి
1. రుద్రదేవుడు ఎ. 1116 – 1157
2. గణపతిదేవ బి. 1199 – 1262
3. ప్రోల -2 సి. 1289 – 1323
4. రుద్రమదేవి డి. 1158 – 1195
5. ప్రతాపరుద్ర -2 ఇ. 1262 – 1289
1) 1-డి, 2-ఎ, 3-బి, 4-ఇ, 5-సి
2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి, 5-ఇ
3) 1-డి, 2-బి, 3-ఎ, 4-ఇ, 5-సి
4) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి, 5-ఇ
ఎ. భారత చరిత్రలో ప్రభావతి
గుప్త రాజ్యాన్ని పాలించిన తొలి మహిళా నాయకురాలు
బి. ఢిల్లీని పాలించిన తొలి మహిళా
నాయకురాలు ఇల్టుట్మిష్ కూతురు
సి. ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించి ఆమె పాలనా, ధైర్యసాహ సాలను కొనియాడారు
డి. శాసనాల ప్రకారం రుద్రమదేవిని రుద్రదేవ మహారాజుగా కీర్తించారు. కానీ ఆమె తన సామంతుల్లో ఒకరైన కాయస్థ అంబదేవుని తిరుగుబాటులో నల్లగొండలోని చందుపట్ల యుద్ధంలో మరణించారు
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బ, సి, డి 4) పైవేవీ కావు
1. ఇటలీ యాత్రికుడు నికోలోకాంటి ఎ. 1520
2. పర్షియన్ యాత్రికుడు/వర్తకుడు అబ్దుల్ రజాక్ బి. 1440
3. పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో పేజ్ సి. 1443
4. పోర్చుగీస్ యాత్రికుడు న్యూనిజ్ డి. 1537
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి 2) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి 4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
ఎ. మాలిక్ కాఫర్చే బంధింపబడి బలవంతంగా మతమార్పిడి చేయబడ్డ హరిహర, బుక్కరాయలు అల్లా ఉద్దీన్ఖిల్జీ మరణాంతరం దక్షిణ భారతం
తిరుగు ప్రయాణమయ్యారు
బి. హిందూమత సామ్రాజ్య స్థాపన కోసం ఆ ఇరువురు సోదరులు తుంగభద్ర నది తీరాన విద్యారణ్య స్వామి ఆశీస్సులతో 1336లో విజయనగరాన్ని స్థాపించారు
1) (ఎ) సరైనది, (బి) తప్పు
2) (బి) సరైనది, (ఎ) తో సంబంధం లేదు
3) (ఎ), (బి) తప్పు ఒకదానికి ఇంకొకటి బలపరచలేవు
4) ఎ, బి సరైనవే, (ఎ) ని (బి) బలపరుస్తుంది