ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ తేదీలను యూనివర్సిటీ ప్రకటించింది. వర్సిటీ పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో రెండేళ్ల వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ డిప్లొమో కోర్సులకు ఈ నెల 10, 11, 12వ తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ రఘురామిరెడ్డి తెలిపారు. మూడేళ్ల డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా ఇవే తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు.
రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. కౌన్సిలింగ్ షెడ్యూల్, విద్యార్థులు తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు, ఫీజు వివరాల కోసం www.pjtsau.edu.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం ర్యాంకుల వారీగా కౌన్సెలింగ్కు హాజరుకావాలని తెలిపారు.