హైదరాబాద్, జూన్28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సామాజిక న్యాయం సాక్షాతారం కావాలంటే పీసీసీ అధ్యక్షుడిగా బీసీలకే అవకాశం ఇవ్వాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్గాంధీకి శుక్రవారం లేఖ రాశారు. తెలంగాణలో, దేశంలో భవిష్యత్తు రాజకీయాలు బీసీల చుట్టే తిరగనున్నాయని, బీసీల ఎదుగుదలను విస్మరిస్తే జాతీయ పార్టీలకు మనుగడ కష్టమేనని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలలో బీసీలకు సీట్లు కేటాయించలేదని, ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవినైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు.