టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమ్ఇండియా విజేతగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై రోహిత్ సేన టీ20 వరల్డ్ కప్ను చేజిక్కించుకుంది. శనివారం బార్బడోస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 17 ఏళ్ల తర్వాత భారత్ టీ20 ప్రపంచ కప్పును ముద్దాడింది.
అయితే ఈ మ్యాచ్ గెలవడానికి ముఖ్య కారణం స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ అందుకున్న క్యాచ్. అయితే టీమ్ఇండియా విజేతగా నిలిచిన అనంతరం సూర్య కుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ ట్రోఫీని తన బెడ్పై హగ్ చేసుకొని పడుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Suryakumar Yadav & his wife with T20I World Cup Trophy. 😄👌 pic.twitter.com/rGCIJA6uHE
— Johns. (@CricCrazyJohns) June 30, 2024
సౌతాఫ్రికా గెలవడానికి 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. క్రీజులో డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. ఇక చివరి ఓవర్ను కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు అప్పగించగా.. పాండ్య వేసిన తొలి బంతిని భారీ షాట్ కొట్టాడు మిల్లర్. ఆ బంతి అమాంతం గాల్లోకి లేచి సిక్సర్వైపు దూసుకుపోయింది. ఇక లాంగాన్లో ఫీల్డింగ్లో ఉన్న సూర్య పరిగెత్తుకుంటూ వచ్చి అంతుచిక్కని రీతిలో బౌండరీ లైన్ వద్ద బంతిని అందుకున్నాడు. దీంతో భారత్కు మళ్లీ విజయ అవకాశలు చిగురించాయి. ఇక ఈ మ్యాచ్లో సూర్య ఆ క్యాచ్ పట్టకుంటే ఫలితం వేరేలా ఉండేది. ఇక లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులకే పరిమితమైంది.