కేప్ కెనావెరాల్, జూన్ 1: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడో రోదసి యాత్ర చివరి నిమిషంలో వాయిదా పడింది. లీకేజ్లు, రిపేర్ల కారణంగా గతంలోనూ రెండుమార్లు ఈ ప్రయోగం వాయిదా పడిన విషయం తెలిసిందే. శనివారం రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం కాగా, కౌంట్ డౌన్ 3 నిమిషాల 50 సెకన్ల వద్ద హఠాత్తుగా నిలిచిపోయింది. బోయింగ్ చేపడుతున్న తొలి ఆస్ట్రోనాట్ ఫ్లైట్ ఇది. దీని ద్వారా సునీతా విలియమ్స్తోపాటు బారీ విలిమోర్ (61)ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపేందుకు నాసా ఈ ప్రయోగాన్ని చేపట్టింది.