Sunita Williams | హోస్టన్, జూన్ 5: భారతీయ మూలాలు కలిగిన వ్యోమగామి సునీత విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌక ద్వారా 25 గంటలు ప్రయాణించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. సునీత(58)తో పాటు బచ్ విల్మోర్(61) కూడా ఈ యాత్రలో ఉన్నారు. పలు వాయిదాల తర్వాత బుధవారం ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ వ్యోమనౌకను ప్రయోగించారు. వారం పాటు వీరిద్దరూ అంతరిక్షంలో ఉండి తిరిగి రానున్నారు.