న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఈ ఏడాదికిగాను తాజాగా విడుదలైన విజికీ న్యూస్ స్కోర్ ర్యాంకింగ్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారత్ నుంచి అగ్రస్థానంలో నిలిచింది. మీడియాలో అత్యంత ఎక్కువగా కనిపించిన కార్పొరేట్గా రిలయన్స్ ఉన్నది. వాల్యూమ్ ఆఫ్ న్యూస్, హెడ్లైన్స్ ప్రెజెన్స్, రీచ్ ఆఫ్ పబ్లికేషన్స్, రీడర్షిప్ వంటి ప్రామాణికతల కొలమానంగా ఈ ర్యాంకులను విజికీ ఇచ్చింది. ఈ జాబితాలో ఎస్బీఐ రెండో స్థానంలో ఉన్నది. ఇక ఈ విషయంలో అంతర్జాతీయంగా ఫేస్బుక్ టాప్ పొజీషన్లో ఉండగా, అల్ఫాబెట్, అమెజాన్, యాపిల్, సామ్సంగ్, నెట్ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గ్లోబల్ ర్యాంకింగ్స్లో రిలయన్స్కు 8వ స్థానం దక్కింది. 100 పాయింట్లకుగాను రిలయన్స్కు 84.9 వచ్చాయి. 90కిపైగా స్కోర్ను సాధించిన సంస్థల్లో ఫేస్బుక్, అల్ఫాబెట్, అమెజాన్, యాపిల్ మాత్రమే ఉన్నాయి. 5వేలకుపైగా పబ్లికేషన్లను పరిశీలించి ఈ ర్యాంకులను ఇచ్చారు. ఇక జాబితాలోని టాప్-10 స్టార్టప్ల్లో ఓలా, డ్రీమ్11, స్విగ్గీ, ఓయో, ఓలా ఎలక్ట్రిక్, భారత్పే, బైజూస్, క్రెడ్, మొబీక్విక్, అన్అకాడమీ ఉన్నాయి.