హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ వేడుకలు (Ramadan) ఘనంగా జరుగుతున్నాయి. ఈద్ అల్ ఫితర్ పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మీర్ ఆలం ఈద్గా, చార్మినార్, మక్కా మసీదు, మాసబ్ ట్యాంక్ వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఒకరికొకరు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సిద్దిపేటలోని మసీద్లో జరిగిన ప్రార్థనల్లో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. అదేవిధంగా హైదరాబాద్ సనత్నగర్లోని వెల్ఫేర్ గ్రౌండ్లో జరిగిన ప్రార్థనల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్, సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి, పెద్దపెల్లిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరకులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.