CM Bhagwant Mann | చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. హర్యానాలో జరిగిన బహిరంగ సభలో మాన్ మాట్లాడుతూ, శంభు, ఖనౌరీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులను బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలోకి అనుమతించడం లేదని మండిపడ్డారు. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించడానికి అవకాశం లేకుండా రోడ్లపై భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారన్నారు.
ప్రభుత్వం ఢిల్లీ నుంచి నడుస్తున్నదని వారు ఢిల్లీకి వెళ్లకపోతే, వారిని లాహోర్కు పంపించాలా? అని ప్రశ్నించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతృత్వంలోని పంజాబ్ రైతులు ‘ఢిల్లీ చలో’ కవాతును ఫిబ్రవరి 13న ప్రారంభించారు.