హైదరాబాద్ : ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్ఎస్(BRS) పార్టీ మారే ప్రసక్తే లేదని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabita indrareddy)స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తాను పార్టీ మారుతున్నట్లు టీవీలు, న్యూస్పేపర్లు, సామాజిక మాధ్యమాల్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రసారమాధ్యమాలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్(KCR) సారథ్యంలో గతంలో ఎలా పనిచేశామో.. ఇప్పుడు కూడా పార్టీ కోసం అలాగే పనిచేస్తామని చెప్పారు.
కేసీఆర్ పార్టీలో నాకు సముచితమైన గౌరవం కల్పించారని గుర్తు చేశారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇటీవల కొందరు పార్టీలో అనేక పదవులు అనుభవించి కాంగ్రెస్లో చేరారని విమర్శించారు. అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. తాను మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తేల్చి చెప్పారు.
— Sabitha Reddy (@BrsSabithaIndra) June 30, 2024