అమరావతి : నెల్లూరు (Minister Nara Lokesh) జిల్లా కావలి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంతో 15 మంది పాఠశాల విద్యార్థులు గాయపడగా లారీ క్లీనర్ (Lorry Cleaner) మృతి చెందాడు. టోల్ప్లాజా వద్ద స్కూల్ బస్సును వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. దీంతో బస్సు బోల్తాపడి 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో లారీ క్లీనర్ మృతి చెందాడు.
గాయపడ్డ విద్యార్థులకు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాద సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిపి 36 మంది వరకు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డికి చెందిన పాఠశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా డివైడర్ ఏర్పాటు చేయడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి : మంత్రి లోకేష్
కావలి సమీపంలో పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) పేర్కొన్నారు. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. స్కూలు యాజమాన్యాలు బస్సులన్నింటినీ కండీషన్లో ఉంచుకోవాలని సూచించారు.