LIC | న్యూఢిల్లీ, జూన్ 29: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ మరో ఖ్యాతిని సాధించింది. దేశీయంగా ఉన్న కార్పొరేట్ బ్రాండ్లలో అత్యంత విలువైన నాలుగో సంస్థగా అవతరించింది. కంపెనీ బ్రాండ్ విలువ 9.8 బిలియన్ డాలర్లతో ఈ స్థానం దక్కించుకున్నదని బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా 100-2024 విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఏఏఏ బ్రాండ్ రేటింగ్తో సంస్థకు 88 స్కోర్ సాధించినట్లు తెలిపింది.
అలాగే టాప్-10 బలమైన దేశీయ బ్రాండ్లలో మూడో స్థానంలో నిలిచింది. బీమా బ్రాండ్ల ర్యాంకింగ్లో ఎల్ఐసీ తన తొలిస్థానాన్ని పదిలపరుచుకున్నది కూడా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీమా సంస్థల విలువలో 9.8 బిలియన్ డాలర్లతో ఎల్ఐసీ తొలి స్థానంలో నిలిచింది. క్యాథీ లైఫ్ ఇన్సూరెన్స్ రెండో స్థానంలో నిలువగా, ఎన్ఆర్ఎంఏ ఇన్సూరెన్స్ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం ఎల్ఐసీలో ప్రభుత్వానికి 96.50 శాతం వాటా ఉండగా, ప్రజలకు 3.50 శాతం వాటా ఉన్నది. స్టాక్ మార్కెట్లో లిైస్టెన సంస్థలో ప్రజలకు కనీసంగా 10 శాతం వాటా ఉండాలనే నిబంధనలపై ఎల్ఐసీకి మరో మూడేండ్ల గడువు ఇచ్చింది. మే 16, 2027 నాటికి ఎల్ఐసీఐలో ప్రజల వాటా 10 శాతానికి పెంచుకోవాలని సూచించింది. మే 17, 2022లో స్టాక్ మార్కెట్లో లిైస్టెన విషయం తెలిసిందే. 3.5 శాతానికి సమానమైన 22.13 కోట్ల షేర్లను బహిరంగ మార్కెట్లో కేంద్ర ప్రభుత్వం విక్రయించింది.