T20 World Cup 2024 | టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమ్ఇండియా విజేతగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై రోహిత్ సేన టీ20 వరల్డ్ కప్ను చేజిక్కించుకుంది. శనివారం బార్బడోస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 17 ఏళ్ల తర్వాత భారత్ టీ20 ప్రపంచ కప్పును ముద్దాడింది.
అయితే ఇండియా గెలిచిన వెంటనే దేశవ్యాప్తంగా యువత ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్లోని తెలంగాణ సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, చిక్కడపల్లి, అశోక్ నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, కూకట్ పల్లి తదితర ప్రాంతాలలో క్రికెట్ అభిమానులు బాణసంచా పేలుస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఇక తెలంగాణ సచివాలయం క్రికెట్ అభిమానులు చేసుకున్న సంబరాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
🇮🇳#India #T20WorldCup🏆🎆🎊
Sea of Fans @ Telangana State Secretariat.Now this place in #Hyderabad has more vibes than Times Square! pic.twitter.com/lEmKRwx2wU
— Hi Hyderabad (@HiHyderabad) June 29, 2024