నాగర్కర్నూల్ : ఇదివరకే పోడుభూములను సాగు చేసుకుంటున్న వాటిని కొనసాగనివ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ( Minister Sitakka ) అధికారులను ఆదేశించారు. నాగర్కర్నూల్లోని
అచ్చంపేటలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లమల్ల ప్రాంత పర్యటనకు వచ్చిన చెంచుల (Chenchus) తో ఆమె భేటీ అయ్యారు.
ఆమె మాట్లాడుతూ చెంచులు కొత్తగా చెట్లను నరికి సాగు చేయవద్దని విన్నవించారు. అడవిని కాపాడుతూ అటవి సంపదతో వనరులను సృష్టించుకోవాలని సూచించారు.చెంచు ప్రజలకు సరైన వైద్యం, విద్య, ఆహారము, ఇల్లు ఉండేలా ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అంతరించపోయే జాతుల్లో చెంచు జాతి కూడా ఉందని దాని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు.
పోడు భూముల విషయంలో అధికారులు చెంచు ప్రజలు సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని సూచించారు. చెంచు ప్రజలు తమ భూముల్లో హార్టికల్చర్ (Horticulture) విధానంతో పండ్లతోటల పెంపకాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. తద్వారా అడవిని కాపాడుకోవడంతోపాటు చెంచులకు జీవనోపాధి లభిస్తుందని తెలిపారు. వృత్తిరిత్యా వైద్యులైన వంశీకృష్ణ దంపతులు నల్లమల్ల ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని గుర్తు చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.