చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. ఢిల్లీ బౌలర్లను తిప్పలు పెడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ సారధి పంత్ బౌలింగ్ మార్పులు చేసినా ఫలితం లేకుండా పోయింది. కాన్వే, రుతురాజ్ ఇద్దరూ ధాటిగా ఆడటంతో ఆ జట్టు పవర్ప్లే ముగిసే సరికి వికెట్లేమీ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. రుతురాజ్ 18 బంతుల్లో 24 పరుగులు చేయగా.. కాన్వే 19 బంతుల్లో 29 పరుగులు చేశాడు.