కొంత విరామం తరువాత నటుడు, నిర్మాత నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ద్వారా యదు వంశీ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో సీనియర్ నటీనటులతో పాటు డజను మంది కొత్తవాళ్లు కూడా నటించారు.
ఆగస్టు 9న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్నే తెచ్చుకుంది. అయితే ఆశించిన రీతిలో వసూళ్లు రాలేదు.. ఎన్ని రకాలుగా ప్రమోషన్ చేసినా.. కలెక్షన్లు ఊపందుకోలేదు. పలువరు సెలబ్రిటిలను తమ ఫంక్షన్లకు గెస్ట్లుగా తీసుకొచ్చినా.. వాళ్లతో ఇంటర్వ్యూలు చేసినా ఫలితం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్కు కూడా చేరుకోలేదు.
అయితే ఈ సినిమా తరువాత ఆగస్టు 15 పోటిలో నిలబడ్డ మరో యూత్ఫుల్ చిత్రం ఆయ్. పూర్తి వినోదాత్మక రూపొందిన ఈ చిత్రం కమిటీ కుర్రాళ్లను మించిన టాక్ను, రివ్యూలను సొంతం చేసుకుంది. అయినా ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లమ్. టాక్కు తగ్గ వసూళ్లు రాలేదు. ఈ సినిమా కోసం కూడా నిర్మాత బన్నీవాస్ రకరకాల ఐడియాస్తో ప్రమోషన్ చేశాడు.
ఇటీవల ఈ సినిమా వసూళ్లు పెరిగాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించగా, అంకిత్ కొయ్య, కసిరెడ్డి, నయన్సారిక ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం దర్శకుడు మణిపుత్రకు మంచి పేరే వచ్చింది. అయితే ఇటీవల ఈ చిత్రం టీమ్ ఎన్టీఆర్ను కలిసి అభినందనలు అందుకుంది. ఎన్టీఆర్ను కలిసిన ఫోటోలు, వీడియోలు వైరల్గా మారడంతో.. ఆ ప్రభావం కాస్త కలెక్షన్లు పెరిగాయి.
దీంతో నిర్మాత నిహారిక కూడా తమ టీమ్ను తీసుకుని పెద్దనాన్న చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లి.. ఆయనతో దిగిన ఫోటోలు, వీడియో బైట్స్ను మీడియాకు పంపించింది. ఇక చిరు కూడా కమిటి కుర్రాళ్లు సినిమా చాలా చక్కగా వుందని ప్రశంసించారు. అయితే ఈ పని సినిమా విడుదలైన వారంలోపు చేసి వుంటే సినిమాకు ఉపయోగపడేదని అంటున్నాయి ట్రేడ్వర్గాలు. సో.. కమిటీ కుర్రాళ్లు మీరు బాగా లేట్ అయ్యారు.. అనే కామెంట్స్ సోషల్మీడియాలో కనిపిస్తున్నాయి.