Shadnagar | షాద్నగర్లోని సౌత్ గ్లాస్ ప్రైవేటు కంపెనీలో జరిగిన పేలుడుపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్లాస్ పరిశ్రమలో జరిగిన పేలుడులో ఆరుగురు మరణించడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇప్పటికైనా అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ను తక్షణమే నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు.
ప్రమాదంలో బాధిత, మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ నేత హరీశ్రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఫ్యాక్టరీల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. ఇప్పటికై ప్రభుత్వం స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లోని స్థానిక సౌత్ గ్లాస్ ప్రైవేటు కంపెనీలోని కంప్రెషర్ పేలడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుడు సమయంలో 150 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు.