అమరావతి : ఏపీ ఎన్నికలపై మాజీ క్రికెటర్ (Former Crickter) అంబటి రాయుడు (Ambati Rayudu) ఎక్స్ వేదిక ద్వారా స్పందించారు. ఓట్ల లెక్కింపులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధిక్యత దిశలో కొనసాగుతుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు, పవన్కల్యాణ్ (Pawankalyan) చేతులు కలిపారని, వారి నాయకత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర కూడా కూటమి విజయంలో ప్రధాన పాత్ర పోషించిందని అన్నారు.
మంగళవారం సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో దేశవ్యాప్తంగా ఎన్టీయే కూటమి గెలుపు దిశగా కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్లో మరింత దూకుడుతో ముందుకు దూసుకెళ్తుంది . 175 అసెంబ్లీ సీట్లలో దాదాపు 145 సీట్లలో కూటమి విజయం దిశగా దూసుకుపోతుంది. అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాల్లో నాలుగు స్థానాల్లో వైసీపీ అధిక్యంలో ఉండగా మిగతా 21 చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు.