Akhilesh Yadav : రిజర్వేషన్ల మూల సూత్రాలకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఎస్పీ చీఫ్, ఆ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీ కుటుంబాల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ, యూపీలోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో ఈ కుటుంబాల నుంచి ప్రాతినిధ్యం కరవైందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ, జవహరల్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీల్లో బీసీలు, దళితులు, మైనారిటీలకు ప్రాతినిధ్యం లేదని, ఈ వర్సిటీల్లో కుటుంబాలకు చెందిన వారికి 15 శాతం కంటే తక్కువగా ఉద్యోగాలు కేటాయించారని దుయ్యబట్టారు.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు సానుకూలంగా లేదని స్పష్టం చేశారు. ఇక టీ20 ప్రపంచ కప్ను భారత్ హస్తగతం చేసుకోవడంపై వ్యాఖ్యానిస్తూ భారత్ విజయాన్ని దేశమంతా ఉత్సాహంగా ఆస్వాదించిందని పేర్కొన్నారు.
Read More :
Rimi Sen | సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే సరిపోదు.. అది లేకపోతే ఏ పనీ జరగదు: రిమీ సేన్