హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి ఏపీకి కేటాయించిన 144 మంది ఉద్యోగులు త్వరలోనే తెలంగాణకు రానున్నారని టీఎన్జీవో కేంద్రసంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ వెల్లడించారు. సంబంధించిన ఫైల్పై సీఎం రేవంత్రెడ్డి ఇటీవలే సంతకం చేశారని, ప్రస్తుతం ఈ ఫైల్ సీఎస్ శాంతికుమారి పరిశీలనలో ఉందని తెలిపారు. సీఎస్ సంతకం కాగానే ఈ ఫైల్ ఏపీకి వెళుతుందని, ఆ తర్వాత వారిని రిలీవ్ చేస్తారని పేర్కొన్నారు.