బాన్సువాడ/ నస్రుల్లాబాద్ 12: తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం (తిమ్మాపూర్ వేంకటేశ్వర ఆలయం) మహిమాన్వితమైనదని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం రూ. 2.17 కోట్లతో 54 గదులతో నిర్మించిన శ్రీనివాస అతిథి గృహ సముదాయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు.
అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కొండంత అండ అని పేర్కొన్నారు. తన పెద్దకుమారుడు పుట్టిన తరువాత నాలుగేండ్ల వరకు మాటలు రాలేవని చెప్పారు. ఈ ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకొని సత్యనారాయణ వత్రం చేసిన వారం రోజులకే మాటలు వచ్చాయని ఆలయ విశిష్టతను వివరించారు. భక్తితో మొక్కిన వారికి కోరికలు తీరుతాయన్నారు. ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ. 23 కోట్లు కేటాయించారని తెలిపారు. భక్తుల కోసం మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ దైవభక్తుడని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. యాదాద్రి ఆలయాన్ని రూ.1200 కోట్లతో కృష్ణ శిలలతో అద్భుతంగా నిర్మించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి పట్టువదలని విక్రమార్కుడని పేర్కొన్నారు. ఆయన పేరు శ్రీనివాసరెడ్డి అని, ఆయన కొలిచే దైవం కూడా శ్రీనివాసుడే అని చమత్కరించారు. 30 ఏండ్ల క్రితం గుట్టల్లో ఉన్న చిన్న గుడిని నేడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి శ్రీనివాసుడిపై భక్తిని చాటుకుంటున్నారని అన్నారు. ఆలయం, ఇక్కడి పరిసరాలు బాగుంటాయని సీఎం కేసీఆర్ తనకు చెప్పారని గుర్తుచేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఏ జిల్లాలో లేనివిధంగా 10వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి పేదల సొంతింటి కలను సాకారం చేశారని అన్నారు. తెలంగాణ తిరుమల తిరుపతి ఆలయ అభివృద్ధికి సహాయ, సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందుతుందన్నారు.
-దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
ఆలయంలో కార్తిక మాసం పురస్కరించుకొని వన భోజన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభాపతి పోచారం, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, జడ్పీ చైర్మన్లు దాదన్నగారి విఠల్రావ్, దఫేదార్ శోభ, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ సత్యనారాయణ, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాస అతిథి గృహం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాలో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి భక్తి గీతాలను ఆలపించి అలరించారు.
మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు పలువురు నా యకులు, అధికారులను డీసీసీబీ చైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి శాలువాలతో సన్మానించి, వేంకటేశ్వరస్వా మి జ్ఞాపికలను అందజేశారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, శ్రీజ్ఞాన సరస్వతి ఆలయ ధర్మకర్త పరిగె శంభురెడ్డి, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఆర్డీ వో రాజాగౌడ్, సొసైటీ కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, ఎంపీపీ రఘు తదితరులు పాల్గొన్నారు.