శ్రీనగర్: ప్రపంచ యోగా గురుగా భారత్ మారిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. యోగా ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతున్నదని చెప్పారు. యోగా సాధన వల్ల సకారాత్మక ఆలోచనలు వస్తాయని తెలిపారు. యోగా, ధ్యానంతో మన ఏకాగ్రత పెరుగుతుందన్నారు. శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేర్-ఏ-కశ్మీర్ కాన్ఫరెన్స్ హాల్ వద్ద జరిగిన అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 50 వేల మంది పాల్గొన్నారన్నారు. శ్రీనగర్లో ఒక శక్తి ఉందని, యోగా ద్వారా దానిని మరింత పెంచుకోవచ్చని తెలిపారు. గత పదేండ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు.
2014లో తొలిసారి తాను అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించానన్నారు. భారతదేశ ప్రతిపాదనకు 177 దేశాలు మద్దతిచ్చాయని చెప్పారు. ఇదొక రికార్డు అని తెలిపారు. అప్పటి నుంచి యోగా దినోత్సవం సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉందన్నారు. విదేశాల్లో యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని వెల్లడించారు. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయన్నారు. జర్మనీలో ప్రస్తుతం కోటిన్నరమంది నిత్యం యోగా చేస్తున్నారని తెలిపారు. యోగా నేర్పే మహిళకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కిందన్నారు.
మన దేశంలోని అనేక వర్సిటీలు యోగా కోర్సులు ప్రారంభించాయని చెప్పారు. యోగా.. ఇవాళ కోట్లమందికి దైనందిన కార్యక్రమైంది. యోగా ప్రాముఖ్యతను అనేక దేశాల నేతలు తనను అడిగారని వెల్లడించారు. యోగా వల్ల శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయన్నారు. నేడు పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరుతున్నానని చెప్పారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచం నలుమూలలా యోగా చేస్తున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Prime Minister Narendra Modi leads a Yoga session at Sher-i-Kashmir International Conference Centre (SKICC) in Srinagar on J&K, on International Day of Yoga. pic.twitter.com/4TkeJnMfcP
— ANI (@ANI) June 21, 2024
#WATCH | Prime Minister Narendra Modi leads Yoga session at Sher-i-Kashmir International Conference Centre (SKICC) in Srinagar on J&K, on International Day of Yoga. pic.twitter.com/N34howYGzy
— ANI (@ANI) June 21, 2024