Jitin Prasada | కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద (Jitin Prasada) కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న మంత్రి.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అంతకుముందు తిరుమలకు వచ్చిన కేంద్ర మంత్రి కుటుంబానికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనం, పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వాదం అందించారు. కేంద్రమంత్రి కుటుంబసమేతంగా ఆలయానికి వచ్చిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Tirupati, Andhra Pradesh: Union Minister Jitin Prasada along with his family offered prayers at the Tirupati Balaji Temple, earlier today. pic.twitter.com/LPaXyNdAxY
— ANI (@ANI) June 30, 2024