Gautam Gambhir : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, బీజేపీ నేత గౌతమ్ గంభీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న గంభీర్.. తెల్లటి సంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆలయానికి వచ్చిన గంభీర్తో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా గంభీర్ కోపాన్ని అణుచుకుంటున్నట్టుగా కనిపించింది. అంతకుముందు ఆలయ అర్చకులు గంభీర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు.
#WATCH | Tirupati, Andhra Pradesh: Former cricketer and BJP leader Gautam Gambhir offered prayers at the Tirupati Balaji Temple. pic.twitter.com/8PpdLEILfR
— ANI (@ANI) June 30, 2024