Microplastics | న్యూఢిల్లీ, జూన్ 30: ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్పై కూరగాయలు, పండ్లు కోయటం ద్వారా కడుపులోకి మైక్రోప్లాస్టిక్ (5 మిల్లీమీటర్ల పొడువు కన్నా తక్కువ) చేరుతుందని తాజా అధ్యయనంలో తేలింది. దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు గుర్తించారు.
ఒక ఏడాదిపాటు ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులను వంట గదుల్లో వాడినట్టయితే, దాని నుంచి 10 క్రెడిట్ కార్డులకు సమానమైన ప్లాస్టిక్ ఆహార పదార్థాల్లో కలుస్తుంది. ఆ తర్వాత వాటిని తిన్నవాళ్ల కడుపులో చేరుతుందని పరిశోధకులు గుర్తించారు.
అంతేకాదు ప్రమాదకర బ్యాక్టీరియా కడుపులోకి చేరి…అక్కడుండే మంచి బ్యాక్టీరియాను దెబ్బతీస్తుందట. ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులకు బదులు వెదురు కర్రలు, పాలరాయి, చెక్కతో చేసినవి వాడటం శ్రేయస్కరమని అధ్యయనం సూచించింది.