LK Advani | బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (LK Advani ) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న తన ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురైన అద్వానీని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్కు తరలించిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఎయిమ్స్లోని పలు విభాగాల వైద్యులు అద్వానీని నిశితంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో ఇవాళ డిశ్చార్జ్ చేశారు (Discharged From AIIMS). ‘వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో అద్వానీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు’ అని ఎయిమ్స్ అధికారి తెలిపారు.
కాగా, మూడు నెలల కిందటే కేంద్ర ప్రభుత్వం అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రదానం చేసిన విషయం తెలిసిందే. వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న అద్వానీ రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా అద్వానీ నివాసానికి వెళ్లి పురస్కారాన్ని అందించారు.
Also Read..
Kallakurichi | కల్తీసారా ఘటనలో 63కు పెరిగిన మృతులు.. సీబీఐ విచారణకు అన్నాడీఎంకే డిమాండ్
Russia | పట్టాలు తప్పి నదిలో పడిపోయిన రైలు బోగీలు.. 70 మందికి గాయాలు