IMD warning : దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో ఆదివారం భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. గుజరాత్లో ఆదివారం నుంచి మంగళవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
అదేవిధంగా ఆదివారం పశ్చిమబెంగాల్, జార్ఖండ్, అసోం, గోవా, మేఘాలయ, మహారాష్ట్రల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కాగా ఆంధ్రప్రదేశ్లోనూ ఇవాళ భారీ వర్షం కురుస్తుందని వాతావరణ విభాగం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఏపీ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.