అయోధ్య: అయోధ్య(Ayodhya)లో కొత్తగా నిర్మించిన రోడ్లు నాసిరకంగా ఉన్నాయి. కొద్దిపాటి వర్షానికే ఆ రోడ్లు జలమయం అయ్యాయి. జూన్ 23, 24వ తేదీల్లో కురిసిన వర్షాలతో.. కొత్తగా నిర్మించిన అయోధ్య రోడ్లు గుంతలు పడ్డాయి. అనేక చోట్ల నీరు నిలిచిపోయింది. రామ్పాథ్ రూట్లో అన్నీ నీటి గుంతలు ఏర్పడ్డాయి. సుమారు 15 బైలేన్లు, వీధులన్నీ జలమయం అయ్యాయి. 14 కిలోమీటర్ల రూట్లో అనేక ప్రదేశాల్లో రోడ్డు తెగిపోయింది.
ఈ నేపథ్యంలో యూపీ సర్కారు చర్యలు తీసుకున్నది. ఆరుగురు అధికారులను సస్పెండ్ చేసింది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ద్రువ్ అగర్వాల్, అసిస్టెంట్ ఇంజినీర్ అనుజ్ దేశ్వాల్, జూనియర్ ఇంజినీర్ ప్రభాత్ పాండే, యూపీ జల్ నిఘంకు చెందిన ఆనంద్ కుమార్ దూబే, రాజేంద్ర కుమార్ యాదవ్, మహమ్మద్ షాహిద్లను సస్పెండ్ చేశారు. స్పెషల్ సెక్రటరీ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు అగర్వాల్, దేశ్వాల్ను సస్పెండ్ చేశారు.
రామ్పాథ్ రూట్లో కొత్త రోడ్డు కొట్టుకుపోవడం పట్ల ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మరింత విచారణకు ఆదేశించారు.