లక్నో: మత పరమైన కార్యక్రమం కోసం ఒక వ్యక్తి పొడవైన వెదురు కర్రను ఇంట్లోకి తెస్తున్నాడు. అయితే ఇంటి బయట ఉన్న హై టెన్షన్ వైర్ను ఆ కర్ర తాకింది. ఈ నేపథ్యంలో విద్యుదాఘాతానికి గురైన ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Man Carrying Bamboo Stick Gets Electrocuted) ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం జసోదా నగర్కు చెందిన సువేంద్ర సింగ్ ఇంట్లో పూజా కార్యక్రమం జరిగింది.
కాగా, చందోన్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల దేవేంద్ర ఈ కార్యక్రమం కోసం బంధువుల ఇంటికి వచ్చాడు. ఆచారంలో భాగంగా జెండా కట్టేందుకు పొడవైన వెదురు కర్రను ఇంట్లోకి తెచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే ఇంటి బయట ఉన్న హై టెన్షన్ వైర్కు ఆ కర్ర తగిలింది. ఈ నేపథ్యంలో విద్యుదాఘాతానికి గురైన ఆ వ్యక్తి కుప్పకూలిపోవడంతో గేట్కు తల తగిలింది.
మరోవైపు ఇది చూసి షాకైన బంధువులు వెంటనే అప్రమత్తమయ్యారు. విద్యుదాఘాతానికి గురైన దేవేంద్రకు సపర్యలు చేసేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో ఆ వ్యక్తి చనిపోయాడు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు తడిగా ఉన్న కర్ర హై టెన్షన్ వైర్ను తాకడంతో ఈ సంఘటన జరిగినట్లు ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న హై టెన్షన్ వైర్ గురించి విద్యుత్ శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. కాగా, ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
महोबा में 22 सेकेंड में युवक की मौत, बिजली के तार में डंडा टच होते ही मौके पर मरा युवक pic.twitter.com/J5znLS5HXx
— shalu agrawal (@shaluagrawal3) July 3, 2024