లక్నో, నవంబర్ 22: ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ సుల్ఖాన్సింగ్ మంగళవారం కొత్త పార్టీని ఏర్పాటుచేశారు. దానికి బుందేల్ఖండ్ లోక్తాంత్రిక్ పార్టీ (బీఎల్పీ)ని పేరు పెట్టారు. ప్రత్యేక బుందేల్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంగా పార్టీని స్థాపించినట్టు ఆయన చెప్పారు.
ఏడు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. బుందేల్ఖండ్ రీజియన్లోని ఎనిమిది స్థానాలను గెలవడమే లక్ష్యంగా 2024 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నట్టు చెప్పారు.