Lok Sabha | 18వ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం స్వీకారం చేయిస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులతో ప్రమాణం చేయిస్తున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మోదీ 3.0 కేబినెట్కు పాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు మంత్రులు కూడా లోక్సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్, ఏపీకి చెందిన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రమాణం చేశారు. వీరంతా తెలుగులోనే ప్రమాణం చేశారు.
తొలిరోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. 27న రాజ్యసభ కూడా ప్రారంభమవుతుంది. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు.
Live: In service of Maa Bharati, taking Oath as Member of Parliament, New Delhi. https://t.co/ypJ2KSDVuJ
— G Kishan Reddy (@kishanreddybjp) June 24, 2024
Union Minister Ram Mohan Naidu Kinjarapu takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/d3E1DC8Yjw
— ANI (@ANI) June 24, 2024
Also Read..
Lok Sabha | లోక్సభ సమావేశాలు ప్రారంభం.. ఎంపీగా ప్రమాణం చేసిన మోదీ
Rahul Gandhi | రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించిన ప్రొటెం స్పీకర్.. 99కి తగ్గిన కాంగ్రెస్ బలం