న్యూఢిల్లీ: యూజీసీ నెట్ జూన్-2024 పరీక్షల సవరించిన షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పరీక్షా కేంద్రాలకు సంబంధించిన వివరాల కోసం పరీక్షలకు 10 రోజుల ముందు ఎన్టీఏ వెబ్సైట్లు https:// ugcnet.nta. ac. in లేదా www. nta.ac. inను సందర్శించవచ్చునని పేర్కొంది.
న్యూఢిల్లీ: తమ అకాడమీలో ఐఏఎస్కు కోచింగ్ తీసుకుంటూ జూలై 27న ఢిల్లీలోని పాత రాజేంద్ర నగర్లోని సెల్లార్ లైబ్రరీలో వరద నీట మునిగి మరణించిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలకు రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ నష్టపరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.50 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపింది.