చెన్నై: తమిళనాడులోని కాళ్లకురిచిలో నాటు సారా తాగిన (Toxic Alcohol) ఘటనలో మృతుల సంఖ్య 29కి పెరిగింది. అస్వస్థతకు గురైన మరో 60 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మెరుగైన చికిత్స కోసం వారిని పుదుచ్చేరిలోని జిప్మర్ దవాఖానకు తరలించారు. ఘటనకు కారణమైన ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారి నుంచి 200 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు. సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన ఆయన కాళ్లకురిచి జిల్లా కలెక్టర్ శ్రావణ్కుమార్పై బదిలీవేటు వేశారు. జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాను సస్పెండ్ చేశారు. వీరితోపాటు మరో 9 మందిని కూడా సస్పెండ్ చేశారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు, పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించాలని ఇద్దరు మంత్రులను ఆదేశించారు. ‘కళ్లకురిచిలో కల్తీ మద్యం సేవించి మృతి చెందారనే వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ ఘటనలో నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశాం. ఈ క్రమంలో నిరక్ష్యంగా ఉన్న అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం. సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటాం’ అని ఎక్స్లో వేదికగా సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు.
Tamil Nadu CM tweets, “I was shocked and saddened to hear the news of the deaths of people who had consumed adulterated liquor in Kallakurichi. Those involved in the crime have been arrested in this matter. Action has also been taken against the officials who failed to prevent…
— ANI (@ANI) June 19, 2024
కాగా, నూతన కలెక్టర్గా ఎంఎస్ ప్రశాంత్, ఎస్పీగా చతుర్వేదిని ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా 18 ప్రత్యేక వైద్య బృందాలను చెన్నై నుంచి కళ్లకురిచ్చి పంపించింది.
Death toll due to alleged illicit liquor consumption in Kallakurichi rises to 29, confirms Kallkurichi District Collector MS Prashanth.#TamilNadu https://t.co/OhawkUyva2 pic.twitter.com/hNazFR671B
— ANI (@ANI) June 20, 2024