Supreme Court | దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024 (NEET-UG 2024) పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.
పరీక్షను నిర్వహిస్తున్న ఏజెన్సీగా న్యాయంగా వ్యవహరించాలని మందలించింది. తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దాలని ఎన్టీయేకి సూచించింది. ఎవరైనా 0.001 శాతం నిర్లక్ష్యంగా వ్యవహరించినా దాన్ని పూర్తిగా పరిష్కరించాలని పేర్కొంది. విద్యార్థుల కష్టాన్ని మర్చిపోకూడదని వ్యాఖ్యానించింది. నీట్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలని కేంద్రం, ఎన్టీయేకి తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.
Also Read..
Drugs | డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసిన వనస్థలిపురం పోలీసులు
Sikandar | సికందర్ ఆన్ డ్యూటీ.. సల్మాన్ ఖాన్ టీం తొలి షెడ్యూల్ వివరాలివే
Asha activists | డీఎంఈ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా