ముంబై: అపార్ట్మెంట్ కాంపెక్స్ నివాసితులు అతిగా ప్రవర్తించారు. జనం కూర్చోకుండా ఉండేందుకు నడక మార్గం అంచుల వద్ద మేకులు ఏర్పాటు చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ బిల్డింగ్ నివాసితుల చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. (Pointed Spikes On Pavement) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. బాంద్రాలోని రెసిడెన్సియల్ కాంప్లెక్స్ వద్ద ఉన్న పేవ్మెంట్కు ఇరు వైపులా గోడల అంచుల్లో సుదుల్లాంటి మేకులను ఏర్పాటు చేశారు. డెలివరీ బాయ్స్, జనం అక్కడ కూర్చోకుండా ఇలా నిరోధించారు.
కాగా, ‘బాంద్రాలోని చెర్రీసన్స్ బిల్డింగ్. ఫుడ్ డెలివరీ కార్మికులు విశ్రాంతి తీసుకోకుండా పేవ్మెంట్ గోడల అంచున మేకులు’ అని ఒక వ్యక్తి ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాలకు హాని కలిగించే ఈ చర్య క్రూరమైందని కొందరు మండిపడ్డారు. ఇది అక్రమ నిర్మాణంలా కనిపిస్తున్నదని, బీఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని, వాటిని తొలగించాలని మరి కొందరు డిమాండ్ చేశారు.
Cherrysons building, Bandra. Spikes on pavement wall to prevent food delivery workers resting. pic.twitter.com/ApVxaVyIrE
— naresh fernandes (@tajmahalfoxtrot) July 2, 2024