Virudhunagar | తమిళనాడు రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విరుదునగర్ (Virudhunagar) జిల్లాలో ఓ బాణాసంచా కర్మాగారం (firecracker factory)లో భారీ పేలుడు (explosion) సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
సత్తూరు (Sattur) సమీపంలో ఉన్న బాణాసంచా కర్మాగారంలో శనివారం ఉదయం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు విరుదునగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు.
#WATCH | Tamil Nadu: Three people killed, one injured in an explosion at a firecracker factory near Sattur in Virudhunagar district. The injured is being treated at the government hospital: Virudhunagar District Collector pic.twitter.com/N3HCvAEIlZ
— ANI (@ANI) June 29, 2024
Also Read..
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా ఢీ కొన్న రెండు కార్లు.. ఏడుగురు మృతి
CM Chandrababu Naidu | తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన డీఎస్: ఏపీ సీఎం చంద్రబాబు
YS Jagan | ఎన్నికల ఫలితాలు చూసి.. హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా.. జగన్ సంచలన వ్యాఖ్యలు