పాట్నా: బీజేపీ, జేడీయూ పాలిత బీహార్లో వరుసగా వంతెనలు కూలిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. బుధవారం మూడు వంతెనలు/కాజ్వేలు కూలిపోయాయి. దీంతో గడచిన 15 రోజుల్లో కూలిన వంతెనల సంఖ్య 9కి చేరింది.
ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందిస్తూ, రాష్ట్రంలోని అన్ని పాత వంతెనలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే మరమ్మతులు జరపవలసిన వంతెనలను గుర్తించాలని చెప్పారు.