Manish Tiwari : ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) ప్రసంగంలో పసలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మనీశ్ (Manish Tiwari) తివారీ విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం ప్రధాని నరేంద్రమోదీ లోక్సభలో సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధాని.. తన ప్రసంగమంతా కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్ష నేత రాహుల్గాంధీని విమర్శించడం, హేళన చేయడంతోనే సరిపుచ్చారు.
ఈ నేపథ్యంలో మంగళవారం లోక్సభ నిరవధిక వాయిదాపడిన అనంతరం బయటికి వచ్చిన మనీశ్ తివారీని మీడియా ప్రతినిధులు పలుకరించారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రధాని ప్రసంగంలో పసలేదని అన్నారు. సుదీర్ఘంగా మాట్లాడిన ప్రధాని చైనా ఆక్రమణల గురించి మాట్లాడలేదని, జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద దాడుల ప్రస్తావన తేలేదని, కొత్తగా అమల్లోకి వచ్చిన క్రిమినల్ చట్టాల ఊసెత్తలేదని తివారీ విమర్శించారు. కేవలం కాంగ్రెస్ పార్టీని నిందించడం, రాహుల్గాంధీని హేళన చేయడానికే ప్రధాని ప్రసంగం సరిపోయిందని అన్నారు.
#WATCH | Delhi: On PM Narendra Modi’s speech in the Parliament, Congress MP Manish Tewari says, “… The Prime Minister did not speak about China, the terror attacks in Jammu, about the flaws in implementation of the criminal laws, and therefore there was nothing of substance in… pic.twitter.com/MGq88nOMYQ
— ANI (@ANI) July 2, 2024